‘అడంగమరు’ దర్శకుడు కార్తీక్ తంగవేలు తన తదుపరి చిత్రాన్ని నటుడు విశాల్ తో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఫైనాన్షియర్ కదిరేశన్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో విశాల్కు కథ చెప్పడంతో ఆయన ఒకే చేశారు.ఆయనకు జోడీగా ప్రియాభవానీశంకర్ నటించనుంది. ఆమెకు కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. బుల్లితెర నుంచి సినీరంగానికి పరిచయమై కోలీవుడ్లో వర్ధమాన నటిగా ప్రియాభవానీశంకర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది.