బాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ ఒక రోజు గ్యాప్లో కన్నుమూసి బాలీవుడ్కు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఆ తర్వాత ప్రముఖ పాటల రచయత అన్వర్ సాగర్, క్రిష్ కపూర్తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఆ సంఘటనలు మరవకముందే..బాలీవుడ్ మరో లెజండరీ డైరెక్టర్ను కోల్పోయింది. బాలీవుడ్లో రజినీగంథ, చోటీ సీ బాత్ వంటి పలు క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బసు ఛటర్జీ కాసేటి క్రితమే కన్నుమూసారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఈ విషయాన్ని టీవీ, సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ పండిత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ఈ రోజే ముంబాయిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించిన ‘చోటీ సీ బాత్’, ‘బాతో బాతో మే’, ఛమేలీ షాదీ వంటి చిత్రాలతో పాటు పలు బెంగాలీ సినిమాలను డైరెక్ట్ చేసారు.