వెబ్ సీరీస్ కు మంచి క్రేజ్ పెరుగుతోంది. పారితోషికం కూడా సంతృప్తికరంగా, ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు.ఇప్పటికే కాజల్, సమంత వంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతోంది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తారు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందుతుందట.