బాహుబలి తర్వాత సౌత్ పరిశ్రమకి సంబంధించి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ 2 రూపొందుతుండగా, కరోనా వలన షూటింగ్కి బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రంలో అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా, ముందుగా సుదీప్ని సంప్రదించినట్టు పుకార్లు షికారు చేశాయి. దీనిపై తాజాగా స్పందించారు సుదీప్
సంజయ్ దత్ పాత్రకి తనని సంప్రదించినట్టు వచ్చిన వార్తలని నవ్వుతూ ఖండించాడు సుదీప్. కేజీఎఫ్ 2 లో నన్ను ఏ పాత్ర కోసం సంప్రదించలేదు. చాప్టర్ 1 పూర్తైనప్పుడు సినిమ చూడటానికి ఆహ్వానం అందించింది. సీక్వెల్లో సంజయ్ సార్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అతనిలా నేను నటించలేను అని సుదీప్ వినయపూర్వకంగా సమాధానం ఇచ్చారు