మలంగ్ చిత్రం నుంచి బీచ్ లో వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది బాలీవుడ్ భామ దిశా పటాని. డైరెక్టర్ మోహిత్ సూరి తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. యాక్షన్ థ్రిల్లర్ ‘మలంగ్’లో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్, కునాల్ ఖేము నటీనటులు. ఈ ఫొటోకు దిశా పటాని పూల ఎమోజీని ఉంచారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన 47 నిమిషాల్లోనే బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సహా 6 లక్షలకు పైగా అభిమానులు లైక్ చేశారు. పటాని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.