అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్గా మారిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ నటనకి టాలీవుడే కాదు కోలీవుడ్ కూడా ఫిదా అయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండేకి తమిళంలో రెండు ఆఫర్లు వచ్చాయి. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న ‘100% కాదల్’ చిత్రంలో నటిస్తున్న షాలిని , మరో వైపు జీవా హీరోగా చేస్తున్న ‘గొరిల్లా’లోను కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. ‘100% కాదల్’ చిత్రం తెలుగులో వచ్చిన 100% లవ్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘గొరిల్లా’ చిత్రంలో నిజమైన చింపాజీ నటిస్తుండగా, దీనితో చిత్ర హీరో, హీరోయిన్స్ స్నేహం చేస్తున్నారట.
థాయ్లాండ్ బాషలో కొన్ని పదాలు కూడా నేర్చుకున్నారట. చింపాంజితో కలిసి నటించేందుకు ప్రారంభంలో కాస్త భయపడినా తర్వాత ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందట షాలిని. అన్బు దర్శకత్వంలో గొరిల్లా అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తెలుగులో సావిత్రి నేపధ్యంలో తెరకెక్కుతున్న మహానటి చిత్రంలోను షాలిని పాండే ముఖ్య పాత్ర పోషిస్తుంది. షాలిని పాండే నటిగానే కాదు సింగర్గాను అలరించిన సంగతి తెలిసిందే. ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్ను ఇటీవల రికార్డ్ చేశారు. ‘లగోరీ’ అనే ఇండియన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు.