సూపర్స్టార్ మహేష్బాబు సోదరి మంజుల డైరెక్షన్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ‘మ
నసుకు నచ్చింది’. అన్నిపనులు పూర్తికావడంతో ప్రమోషన్ వేగవంతం చేశారు. సందీప్ కిషన్- అమైరా దస్తర్- త్రిధాచౌదరి కాంబినేషన్లో రానుంది. దీనికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల ట్రైలర్ని యూనిట్ రిలీజ్ చేసింది. ప్రిన్స్ వాయిస్తో కూడిన ఈ వీడియోని సూపర్స్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.గతరాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది యూనిట్. దీనికి మహేష్బాబు గెస్ట్గా అటెండయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్స్.. మంజుల డైరెక్షన్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, స్టోరీ ప్రిపేర్ చేసి సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు తాను షాక్ అయ్యానని తెలిపాడు. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని, భవిష్యత్లో మా అక్క మంజులతో తాను సినిమా కూడా చేస్తానేమోనన్న ఒపీనియన్ని వ్యక్తంచేశాడు మహేష్బాబు.