మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది.. ఈ వేడుకలలో భాగంగా అమెరికాలో పలు ప్రాంతాలలో సినీ నటులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమాలకు చిరంజీవి, మహేష్ బాబు తో సహా టాప్ హీరోలందరూ హాజరుకానున్నారు.. అయితే ఈ కార్యక్రమాలలో పాలుపంచుకోవలసిందిగా హీరోయిన్స్ ను కోరితే ఇప్పటి వరకూ సరైన స్పందన లేదని మా అధ్యక్షుడు శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు.. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఫండ్స్ తో మా కోసం స్వంత భవనాన్ని నిర్మించాలని అనుకుంటున్నామని, అయితే హీరోయిన్స్ నుంచి సరైన సహకారం లభించడం లేదని వివరించాడు..చెక్ బౌన్స్ వంటి కేసులు ఎదురైనప్పుడు మాత్రమే వారు తమను సంప్రదిస్తారని ఆరోపించాడు.. ఇకపై తమ కాల్స్ కు హీరోయిన్లు రెస్పాండ్ కాకుంటే… వారికి ఎలాంటి సహాయం చెయ్యబోమని స్పష్టం చేశాడు. పారితోషికం ఇబ్బందులను పరిష్కరించుకునేందుకే హీరోయిన్లు ‘మా’లో చేరారని వ్యాఖ్యానించాడు..