ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని ప్రకటించిన మోహన్ బాబు...

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 05:06 PM



ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చివరగా 'మహానటి' సినిమాలో నటించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రను పోషించి, మెప్పించారు. సినిమాల విషయంలో ఇటీవలి కాలంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గుర్తింపు కలిగిన పాత్రలను మాత్రమే ఆయన ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో నటిస్తున్నారు.


తాజాగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. సొంత బ్యానర్ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిన్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేశారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com