న్యూయార్క్ః పంజాబ్ నేషనల్ బ్యాంక్ 11 వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ సేఫ్గా దేశం విడిచి వెళ్లిపోయాడు. అసలు పీఎన్బీ సీబీఐకి ఫిర్యాదు చేయడానికి ఎంతో ముందే, జనవరి 1నే అతను దేశం వదిలి పారిపోయాడు. అయితే అతను స్విట్జర్లాండ్కు, కుటుంబ సభ్యులు బెల్జియంకు పారిపోయినట్లు వార్తలు వచ్చినా.. తాజాగా అతను న్యూయార్క్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి లగ్జరీ మాడిసన్ అవెన్యూ జువెలరీ రిటెయిల్కు దగ్గర్లో ఉన్న హోటల్లో మోదీ ఉన్నారు. పీఎన్బీలో 280 కోట్ల స్కాం జరిగినట్లు జనవరి 29న సీబీఐకి ఆ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈ నెల 14న తమ ముంబై బ్రాంచ్లో 11360 కోట్ల భారీ మోసం జరిగినట్లు ఆ బ్యాంక్ మరోసారి వెల్లడించింది. నీరవ్ మోదీపై పీఎన్బీ ఫిర్యాదు చేసింది. నీరవ్ మోదీతోపాటు అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ దేశవ్యాప్తంగా ఉన్న అతని ఆస్తులపై దాడులు చేసి రూ.5100 కోట్ల విలువైన ఆభరణాలు, వజ్రాలను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ మొత్తాన్ని పీఎన్బీయే చెల్లించాలని ఆర్బీఐ స్పష్టంచేసింది.