ఆమె వయసు 41 ఏళ్ళు..ఈ ముదురు సుందరి అందాలు ఘాటు ఇప్పటికీ కుర్ర కారు ఊపిరాడకుండా చేస్తోంది. ఒకప్పుడు పవన్ సరసన, మహేష్ సరసన రొమాన్స్ పండించిన ఈ ముదురు బ్యూటీకి లక్షల్లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో అర్థమైపోయి ఉంటుంది. అమీషా పటేల్ గురించే ఇదంతా. లేటెస్ట్ గా అమీషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ భామ హాట్ హాట్ అందాలు కుర్ర హృదయాల్ని కుదురుగా ఉండనీయడం లేదు. తాజగా బికినిలో ఆమె అందాలు నభూతో నభవిష్యతి అనిపించక మానదు.నాలుగు పదుల వయసులో కూడా అమీషా పటేల్ ఉన్నంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో మరే హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. వరుసగా తన అందాల ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.అమీషా పటేల్ అందం గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. ఈ వయసులో కూడా పర్ఫెక్ట్ గా ఆమె తన ఫిజిక్ ని మెయిన్ టైం చేస్తోందంటే నిజంగా ఆశ్చర్యకరం. అమీషా పటేల్ తాజగా పోస్ట్ చేసిన ఫోటోలలో తడి అందాలు సెగలు పుట్టించే విధంగా ఉన్నాయి.ఎక్కడ 2000.. ఎక్కడ 2018.. 18 ఏళ్ల క్రితం పవన్ చిత్రం బద్రిలో అమీషా పటేల్ ఎలాంటి అందాల మెరుపుతో ఉందొ ఇప్పటికి అలాగే ఉంది. బద్రి చిత్రంతో అమీషా తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయింది. బద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.అమీషా ఎక్కడా కనిపించినా తన గ్లామర్ టచ్ మిస్ కాకుండా చూసుకుంటోంది. సినీ ఈవెంట్ ఏది జరిగినా అక్కడా తన మార్క్ ఉండాలని ఆరాటపడుతోంది. ఈ ప్రయత్నం మొత్తం ఈ వయసులో కూడా దర్శక నిర్మాతలని ఆకర్షించి ఒకటి అరా అవకాశాలు దక్కించుకోవడం కోసమే.