ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకుంటా : షాలిని పాండే

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 10:53 AM



‘అర్జున్‌రెడ్డి’తో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న నటి షాలినిపాండే. ఈ అమ్మడుకు ఇప్పుడు తెలుగు, తమిళంలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో జీవీ ప్రకాశ్‌ సరసన ‘100% కాదల్‌’, జీవాతో ‘గొరిల్లా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. దీనిగురించి షాలిని పాండే మాట్లాడుతూ ‘అర్జున్‌రెడ్డి’లోని ప్రీతి పాత్ర నన్ను చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితురాలిని చేసింది. పలు సినిమాల క్రేజీని ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ‘ప్రీతి’ అనే పిలుస్తున్నారు. ఆ పిలుపు నాలో మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్రజల ప్రేమ, అభిమానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసింది. అయినప్పటికీ ఆ సినిమా ద్వారా వచ్చిన విజయం, పేరు ప్రఖ్యాతలను తలకెక్కించుకోను. నేను ఎప్పటిలాగే ఉన్నా. తెలుగులో లాగే తమిళంలోను ప్రేక్షకుల మన్ననలు అందుకుంటా. ‘100% కాదల్‌’, ‘గొరిల్లా’ చిత్రాలతో అది సాధ్యమవుతుందని నమ్ముతున్నా. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించడానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను కూడా వెల్లడిస్తానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com