అమలాపాల్ తెలుగు లోనే కాకుండా ఇతర బాషలోకూడా తనదయిన అభినయం కనపరుస్తూ అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.ఇటీవల సరైన విజయం చూడని అమలాపాల్ కెరీర్ స్లో అయిందనే చెప్పాలి.ఎంత కెరీర్ స్లో గా ఉన్న,ఈ మధ్య కొన్ని వివాదాలలో ఆమె చిక్కుకున్న కూడా అమలాపాల్ కు మరో అవకాశం రావటం విశేషం.వివరాలలోకి వెళ్తే,
లగ్జరీ కారు కొనుగోలులో అవకతవకలు, లైంగిక వేధింపులు, ఇతరత్రా కారణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నప్పటికీ ‘మైనా’ సుందరి అమలాపాల్కు సినిమా ఛాన్సులు వరుసగా వస్తూనే ఉన్నాయి. తమిళంలో అరవింద్స్వామి జోడీగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, కన్నడం, మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది.
తాజాగా జాతీయ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం పొందిన మలయాళ దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్న ‘ఆడు జీవితం’ అనే చిత్రంలో ఎంపికైంది. ఇందులో మాలీవుడ్ స్టార్ పృథ్విరాజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి అమలాపాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ... ‘ఈ ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా, అంతకుమించిన గౌరవంగా ఉంది. త్రీడీలో రూపొందబోతున్న ఈ క్లాసికల్ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని పేర్కొంది.