గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ) వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మతో సీసీఎస్ పోలీసుల విచారణ శనివారం ముగిసింది. పోలీసులు ఆయన ల్యాప్టాప్ను సీజ్ చేశారు. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణలో ఈ వెబ్ సిరీస్ను తాను రిలీజ్ చేయలేదని, డైరెక్ట్ చేయలేదని చెప్పినట్లు అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు.తాజాగా దీనిపై వర్మ సోషల్మీడియా ద్వారా స్పందించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ‘జీఎస్టీ’ వెబ్సిరీస్ను నేను డైరెక్ట్ చేయలేదని కేవలం సాంకేతిక అంశాలకు మాత్రమే సహకరించినట్లు చెప్పానని నాపై తప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. నేను తీసిన సినిమాను తీయలేదని ఎందుకు చెప్తాను? సినిమాను నేనే డైరెక్ట్ చేసినట్లు సిరీస్లో ఉందిగా?’ అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ వెబ్సిరీస్పై ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి అనే మహిళ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.