ప్రముఖ టీవీ నటి, హిందీ బిగ్ బాస్ 4వ సీజన్ విజేత శ్వేతా తివారీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు సెప్టెంబర్ 16 నుంచి దగ్గు ప్రారంభమైందని ఎంతకైనా మంచిదని పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. కొడుకు రేయాన్ష్ ను శ్వేతా తండ్రి అభినవ్ శుక్లా వద్దకు పంపారు. ఆమె కూతురు పాలక్ కూడా భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉంటుంది. తనకు అక్టోబర్ 1 వరకు క్వారంటైన్ గడువు ఉందని ఆమె తెలిపారు. కాగా శ్వేతా తివారీకి కసౌటీ జిందగీ కే(జీవితం పెట్టే పరీక్షలు) సీరియల్ మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె ప్రస్తుతం మేరే డాడ్ కీ దుల్హాన్లో నటిస్తున్నారు.