ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్సీబీ ముందు హాజరవుతున్నట్లు కన్ఫామ్ చేసిన రకుల్‌..

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 24, 2020, 05:19 PM



సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సునిశితంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తోంది. మొదట రియా చక్రవర్తిని ఇంటరాగేట్ చేసేటప్పుడు కొంతమంది సెలబ్రిటీల పేర్లు బయటకు రాగా, తర్వాత టాలెంట్ మేనేజర్ జయ సాహాను ప్రశ్నించినప్పుడు మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిలో బాలీవుడ్ తారలు దీపికా పడుకోనే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, టాలీవుడ్‌కు చెందిన నమ్రతా శిరోద్కర్‌, రకుల్‌ప్రీత్ సింగ్ వంటివాళ్ల పేర్లున్నాయి. వారికి ఎన్సీబీ సమన్లు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఎవరూ ఇంతదాకా స్టేట్‌మెంట్లు రిలీజ్ చేయలేదు. ఏదేమైనప్పటికీ, ఎన్సీబీ నుంచి సమన్లు వచ్చిన విషయాన్ని రకుల్‌ప్రీత్ టీమ్ ధ్రువీకరించింది. సమన్లను రకుల్ తీసుకున్నట్లు ఒక ఎన్సీబీ అధికారి కన్ఫామ్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com