న్యూఢిల్లీ : కేరళ నటి ప్రియాప్రకాష్ వారియర్ కేసును సుప్రీంకోర్టులో ఇవాళ విచారించారు. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ప్రియా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ, మహారాష్ట్రలో నమోదైన కేసులపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నటి, దర్శకుడిపై దేశవ్యాప్తంగా ఎక్కడా క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది.