శంకర్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కెరీర్ అంత బాగుందనే అపోహ చాలా రోజులు ఉండేది. 'అపరిచితుడు'లో నటించిన సదా, 'శివాజీ'లో యాక్ట్ చేసిన శ్రియ వంటివారు అప్పట్లో తెరమరుగవ్వడం అందుకు కారణంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే.. శంకర్ దర్శకత్వంలో నటించిన సదా మినహా మిగతా అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. శంకర్ తో `జీన్స్, రోబో' సినిమాల్లో నటించిన ఐశ్వర్య ఇప్పటికీ బాలీవుడ్ లో చక్రం తిప్పుతోంది. `మనోహరుడు' (ఐ)లో నటించిన అమీ జాక్సన్ పరిస్థితి కూడా అలాగే అవుతుందేమో అని అందరూ భావించారు. కానీ శంకర్ మళ్ళీ ఆమెను '2.0'లో తీసుకోవడంతో ఆమె జాతకం మారిపోయింది.
సరే ఇదంతా ఎందుకంటే.. '2.0' సినిమా పుణ్యమా అని జాతీయ స్థాయిలో పాపుల అయినా అమీ జాక్సన్.. ఈ సినిమా రిలీజ్ అనంతరం పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన అమీ.. మోడలింగ్ డేస్ నుంచి తను డేటింగ్ చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.