సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న కాజల్ అగర్వాల్ రీసెంట్గా అ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్వీన్ కి రీమేక్గా పారిస్ పారిస్ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎంఎల్ఏ చిత్రంలోను కాజల్ కథానాయికగా నటిస్తుంది. అయితే కాజల్ సోదరి నిషా అగర్వాల్ త్వరలో తల్లి కాబోతుందనే విషయం గతంలోనే చెప్పుకున్నాం. రీసెంట్గా నిషా ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో నిషా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక కాజల్కి పెద్దమ్మ ప్రమోషన్ రావడంతో, వెంటనే ఆ బాబుని ముద్దాడుతూ ఫోటోకి ఫోజిచ్చింది. అంతేకాదు ఆ ఫోటోని తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ చెల్లెలి కుమారుడి పేరు ఇషాన్ వాలేచా అని నెటిజన్స్కి పరిచయం చేసింది. నిషా అగర్వాల్, ప్రముఖ వ్యాపార వేత్త కరణ్ను 2013, డిసెంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏమైంది ఈ వేళ, సోలో సినిమాలతో తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్న నిషా ఆ తర్వాత సరైన హిట్స్ సాధించలేకపోయింది. దీంతో పెళ్లి పీటలెక్కింది. పెళ్ళి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది నిషా.