గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు మరోసారి కలిసి నటించబోతున్నారట. కృష్ణ వంశీ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన సౌజన్య చెప్పిన కథ నచ్చడంతో ఆమెతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాడట చైతు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడ సౌజన్య స్క్రిప్ట్ పట్ల ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి సుముఖంగా ఉందట.
వీరిద్దరి గత సినిమాల కంటే ఈ చిత్రం భిన్నంగా ఉండనుందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా చేస్తున్న ఈయన దానితో పాటే మారుతి డైరక్షన్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని కూడ చేస్తున్నాడు. ఈ రెండూ షూటింగ్ దశలో ఉండగానే ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని చేసే ఆలోచనలో ఉన్నాడు చైతు.ఇక ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ అజయ్ దేవగన్ తో సినిమా చేస్తూనే తమిళంలో సూర్య, కార్తీలతో ఒక్కో సినిమా చేయనుంది.