నిర్మాతలుగా మారే కథానాయికలు చాలా తక్కువగా వుంటారు. వ్యాపారంలోకి దిగి రిస్క్ చేసే వాళ్లు అరుదుగా వుంటారు. ఇప్పుడు మమత మోహన్ దాస్ కూడా అలా రిస్క్ చేస్తూ నిర్మాతగా మారింది. మొదట్లో చిత్రసీమకు గాయనిగా పరిచయమై.. తదనంతర కాలంలో ఆమె తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్.. వంటి పలు సినిమాలలో కథానాయికగా నటించి, గ్లామర్ గాళ్ గా పేరుతెచ్చుకుంది.
చివరికి కేన్సర్ ని జయించి మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చింది. నిర్మాతగా అడుగేస్తోంది. తొలిసారిగా మలయాళంలో ఓ చిత్ర నిర్మాణాన్ని చేబట్టింది. ఆమె నిర్మించే తాజా సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. 'మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పింది.