తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఈ మధ్య బాగా వినిపించింది . ఆమె ఎవరో కాదు... వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల వయసులో ఇటీవల మూడో పెళ్ళి చేసుకొని వార్తల్లో నిలిచింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ అనే గత జూన్ లో మూడో పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ వనితా విజయ్ కుమార్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె మూడో పెళ్లి గోల సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ వార్త తమిళ నట చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ జంట గోవా ట్రిప్ కు వెళ్లారట ..ఆ ట్రిప్ లో మద్యం తాగి పీటర్ వనితని కొట్టాడని టాక్. చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి తరిమేసిందని ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి చర్చించుకుంటున్నారట..