యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కిరాక్ పార్టీ మార్చి 16నే విడుదల కానుంది.. గతంలో ఈ మూవీ మార్చి 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న గడువు కన్నా ముందే పూర్తి కావడంతో రిలీజ్ తేదిని ముందుకు జరిపారు.. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డేలు నటించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ సినిమాకు డైరెక్టర్ సుధీర్ వర్మ స్ర్రీన్ ప్లే అందించగా మరోక దర్శకుడు చందూ మొండేటి మాటలు రాశారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చాడు.. కాగా ఈ మూవీలోని గురువారం సాంగ్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది..