ముంబై: నీరవ్ మోదీ వజ్రాల సంస్థ ఫైర్స్టార్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఆ కంపెనీతో తన కాంట్రాక్టును వదులుకున్నది. ఈ విషయాన్ని హీరోయిన్ తరపున ఆమె ప్రతినిధి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు నీరవ్ మోదీ సంస్థ సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టింది. ఆ కేసులో విచారణ కొనసాగుతున్నది. అయితే ఆ కంపెనీ ఆభరణాలకు ప్రియాంకా గతంలో ప్రమోషన్ చేసింది. తనకు రావాల్సిన అమౌంట్ను కూడా నీరవ్ ఇవ్వలేదని ఇటీవల ప్రియాంకా పేర్కొన్న విషయం తెలిసిందే.