టాలీవుడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న సినిమా 'లక్ష్య'. నాగశౌర్య పుట్టిన రోజును పురస్కరించుకుని 'లక్ష్య' సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విలువిద్యలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా కేతిక శర్మ నటిస్తున్నారు. శరత్మరార్, నారాయణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2021 మేలో ఈ సినిమాను విడుదల చేయునున్నారు. 'లక్ష్య' నుంచి విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేవిధంగా ఉంది.