ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 'ఇండియా లాక్​డౌన్' మూవీ..షూటింగ్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 22, 2021, 02:25 PM



ప్రముఖ బాలీవుడు దర్శకుడు మధూర్ భండార్కర్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. టైటిల్​ను 'ఇండియా లాక్​డౌన్'గా ఖరారు చేశారు. భండార్కర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీజే మోషన్‌ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీ సెట్స్ పైకి వెళ్లింది. భారత్​లో విధించిన లాక్​డౌన్​ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు భండార్కర్. ఇందులో ప్రతిక్ బబ్బర్, శ్వేతా బసు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన 'రంగీలా' చిత్రంలో తొలుత అతిథి పాత్రలో కనిపించారు భండార్కర్. ఆ తర్వాత 'త్రిశక్తి', 'చాందినీ బార్'‌, 'సత్తా', 'కార్పోరెట్', 'ట్రాఫిక్‌ సిగ్నల్'‌ వంటి చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలతో పాటు రచయితగానూ పనిచేశారు. భండార్కర్‌ సినిమాల్లోని సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. 2017లో 'ఇందు సర్కార్‌' సినిమా తరువాత మధూర్‌ భండార్కర్‌ ఎటువంటి సినిమా చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com