పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో తలపడేందుకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. 'కేజీయఫ్' దర్శకుడు ప్రశాంత్నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించనున్న చిత్రం 'సలార్'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో వేడుకగా జరిగింది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ జరుపుకోనున్న 'సలార్'లో ప్రతినాయకుడిగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'మాస్టర్'లో ప్రతినాయకుడి పాత్రను పోషించిన విజయ్సేతుపతి నటనను చూసి ఫిదా అయిన ప్రశాంత్ నీల్.. 'సలార్' ఆఫర్ ఇచ్చినట్లు చిత్రపరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్కు చెందిన నటీనటులను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.