గచ్చిబౌలిలో మొక్కలు నాటారు హీరోయిన్ నందితా శ్వేత. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందిన నందితా శ్వేత.. ఈ ఛాలెంజ్లో పాల్గొని మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ను విసిరింది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు (శనివారం) మొక్కలు నాటడం జరిగింది. ఇలా మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్గారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను..” అన్నారు.