ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటిన ‘నందితాశ్వేత’

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 09:27 AM



గచ్చిబౌలిలో మొక్కలు నాటారు హీరోయిన్ నందితా శ్వేత. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందిన నందితా శ్వేత.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసిరింది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు (శనివారం) మొక్కలు నాటడం జరిగింది. ఇలా మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను..” అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com