టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి పేరు కచ్చితంగా వినిపిస్తుంది. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆకట్టుకున్నారు. తాజాగా సాయి పల్లవి నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లిరికల్ పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి ప్రధానంగా సాగే పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాట ఫిబ్రవరి28న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. అయితే 'సారంగ దారియా' అని సాగనున్న ఈ పాటను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.