ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. శర్వానంద్ నటించిన 'శ్రీకారం' థియేటర్లలో మార్చి 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సన్ నెక్స్ట్ యాప్ లో ఏప్రిల్ 16 నుంచిప్రసారం కానుంది. ఇక జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్నాయి. ఆహా యాప్ లో క్రాక్, నాంది, గాలి శీను, జాంబి రెడ్డి సినిమాలు ఇప్పటికే ప్రసారం అవుతున్నాయి. తాజాగా థియేటర్లలో విడుదలైన తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా సినిమాలు కూడా ఈ నెల 16, 23 నుంచి వరుసగా స్ట్రీమింగ్ కానున్నాయి.