టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామాయణం' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'యువరాజు' సినిమా విడుదలై 21 ఏళ్లు అవుతోంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ ప్రిన్స్ గా అభిమానుల మనసుల్లో నిలిచాడు.