నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఎంఎల్ఏ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రం చేస్తున్నాడు. మార్చి 23న మూవీ విడుదలకి ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరచిన రెండో సాంగ్ని తాజాగా విడుదల చేశారు. హే ఇందూ అనే సాంగ్ సంగీత ప్రియులని అలరిస్తుంది. కరసాల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్కి డెబ్యూ ఇచ్చిన కాజల్ ఎంఎల్ఏ చిత్రం ద్వారా కళ్యాణ్ సరసన రెండో సారి జతకట్టింది. సి భరత్ చౌదరి, ఎంవి కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన సాంగ్పై మీరు ఓ లుక్కేయండి.