సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీ తో సరదగా' ప్రోగ్రామ్లో తోటి నటి రజిత కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్తో పాటు సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త ఎలా చనిపోయాడనే విషయాన్ని చెప్పి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు సురేఖ వాణి. మరోవైపు తన కూతురు సుప్రీత నటనతో శిక్షణ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో రావడమనేది పూర్తిగా ఆమెపై ఆధారపడి ఉందన్నారు. చిరవగా ఆలీ ఓ ప్రశ్న సంధిస్తూ.. ఇండస్ట్రీ హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే.. ఎవరికిస్తారు అనే కొంటె ప్రశ్నకు వెంటనే పవన్ కళ్యాణ్ అంటూ అంతే గడుసుగా సమాధానమిచ్చింది. మొత్తంగా ఈ షోలో సురేఖ వాణి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానుతో పంచుకున్నారు.