‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమా డిజాస్టర్స్ గా మిగిలిపోయినా.. నిధికి మాత్రం అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్… మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ దిశ మారిపోయింది. ఈ సూపర్ హిట్ సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ మంచి ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిధి తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే శింబు సరసన ఈశ్వరన్ సినిమాలో, జయం రవి భూమి చిత్రంతో నిధి అగర్వాల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.