కరోనా లాక్డౌన్ ముందు వరకు సోనూసూద్ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి మనసుల్లో దేవుడిగా కొలువైయ్యారు. తాజాగా దేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తోంది. ఎవరు కూడా ఈ తరహా ఉత్పాతాన్ని ఊహించలేదు. చాలా మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూస్తున్నారు. ఇప్పటికే కేంద్రం యుద్ధ ప్రాతిపదికన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ కంటెనర్స్ తెప్పిస్తున్నాయి. మరోవైపు దేశంలో వివిధ ప్రదేశాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సోనూ సూద్ సెకండ్ వేవ్ లో ఇంత దారుణంగా ఉంటే.. థర్ట్ వేవ్ వస్తే చెప్పడానికి మాటల కూడా రావు. ఈ సందర్భంగా సోనూ సూద్ కూడా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ దేశానికి సోనూ సూద్ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఆర్డర్ చేసారట. మరో రెండో వారాల్లో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ఫ్రాన్స్తో పాటు వివిధ దేశాలతో మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. ప్రతితీ సమయానికి అందేలా తన వంతు సాయం చేయడానికి రెడీగా ఉండాలని తన టీమ్కు సూచించినట్టు సోనూ తెలిపారు.