దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. సామాన్యులు మాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తోంది. ప్రముఖ టాలీవుడ్ యువ రచయిత.. దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు.తెలుగు సినీపరిశ్రమలో రచయితగా సుప్రసిద్ధుడైన రవి ఇంతకుముందు నాగశౌర్య- అవికా గోర్ జంటగా నటించిన `లక్ష్మీ రావే మా ఇంటికి` చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ఒరేజ్ బుజ్జిగా.. పవర్ ప్లే వంటి చిత్రాలకు ఆయన రయితగా పని చేశారు. నంద్యాల రవి కరోనా సోకగా ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడికి ఆస్పత్రి రూ.7లక్షల బిల్లు వేయగా అది చెల్లించలేని పరిస్థితిలో తన మిత్రుడైన నటుడు సప్తగిరి 1లక్ష ఆర్థిక సాయం అందించారు. కానీ ఇతర సెలబ్రిటీలు అతడి పరిస్థితికి స్పందించకపోవడం కలచివేసింది.