కరోనా వేళ అన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. షూటింగ్లు కూడా రద్దవుతున్నాయి. కానీ సంచలనాల దర్శకుడు ఆర్జీవీ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొస్తున్నాడు. 'డేంజరస్' అనే బోల్డ్ మూవీ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్లను లెస్బియన్స్గా కనిపించనున్నారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రేమికులుగా నటించారు. స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే ప్రేమ ఉండదని.. ఇద్దరు కూడా పరస్పరం గాఢంగా ప్రేమించుకుంటారని ఈ చిత్రంలో చూపించబోతున్నారు ఆర్జీవీ. ఇద్దరు అమ్మాయిలు లైలా-మజ్నూ, రోమియో-జూలియెట్లా ప్రేమలో ముగి తేలితో ఎలా ఉంటుందో తన దైన శైలిలో చిత్రీకరించారు. దేశంలోనే మొట్ట మొదటి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ సినిమా ఇదేనని ఆర్జీవీ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన డేంజరస్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ను షేర్ చేస్తోంది. ట్రైలర్ చూసిన నెటిజన్స్.. ఇలాంటి మూవీ నెవ్వర్ బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ తీసుకొచ్చారు. స్పార్క్ పేరుతో కొత్త వేదికను రూపొందించారు. స్పార్క్లోనే డేంజర్ సినిమా కూడా విడుదలకానుంది. ఈ మూవీకి సంబంధించి ఆర్జీవీ కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి