తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్కు అందజేశారు. ఇప్పటికే తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సూర్య-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్, శివకార్తికేయన్ రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించారు.