ప్రస్తుతం టాలీవుడ్లో మచ్ ఎవైటెడ్ మూవీలలో మహానటి కూడా ఒకటి అని చెప్పవచ్చు. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ ఒకరికొకరు చాలా క్లోజ్గా ఉన్న ఈ ఫోటో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇది చిత్ర యూనిట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది కాదు. దుల్కర్ సల్మాన్ అభిమాని ఒకరు ఈ పోస్టర్ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. చిత్రంలో జమునగా సమంత, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఏఎన్ఆర్గా చైతూ నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. తెలుగు,తమిళ భాషలలో భారీ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న మహానటి చిత్రం సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలో రూపొందుతుంది . మిక్కీ జేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మార్చి 29న విడుదల కానున్న ఈ చిత్రంకి తమిళంలో ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ మూవీ రూపొందుతుంది.