చిరంజీవి సినిమాలతోనే కాదు సేవ గుణం లోను మెగాస్టారే. ఇప్పటికే ఆయన బ్లడ్ బ్యాంక్ ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ కరోనా కష్ట కాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ ఏర్పాటు చేసి ఎంతో మందికి సాయం అందించారు.నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు.రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని మెగాస్టార్ అన్నారు. రక్తదానం చేయాలని చిరంజీవి తన అభిమానులకు పిలుపునిచ్చారు.