నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య విభిన్న పాత్రల్లో నటిస్తారని గుసగుసలు వినిపిస్తన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రాగ్య జైశ్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు కరోనా కారణంగా ప్రస్తుతం బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించాల్సి ఉంది. దీని పై అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సినిమాలో మిగతా నటీనటుల కోసం గోపీచంద్ మలినేని ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. అయితే ఇందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ను ఒక పాత్ర కోసం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ అనే పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉండగా కథ ప్రకారం ఈ సినిమాలో మరో సీనియర్ నటి అవసరం ఉందట..అందుకోసం టబును సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపస్తున్నాయి. ఇక ఇదివరకే బాలకృష్ణ, టబు కలిసి చెన్నకేశవరెడ్డి, పాండురంగడు, అనే చిత్రాల్లో కలిసి నటించారు. మరి ఆ సీనియర్ నటి స్థానంలో గోపీచంద్ మలినేని ఎవరిని సెట్ చేస్తారో చూడాలి.