దర్శకుడు అశుతోష్ గోవరికర్ 2016లో భారీ వ్యయంతో తెరకెక్కించిన ‘మొహెంజొ దారో’ చిత్రం నిరాశపరిచింది. అందుకే తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం పానిపట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో అర్జున్కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రధారులు. మరో కీలకమైన పాత్రను బాలీవుడ్ భామ కృతి సనన్ పోషించనుంది. ఇందులో మరాఠా యోధుడు సదాశివ్ రావ్ బహు పాత్రలో అర్జున్ కపూర్, అహ్మద్ షా అబ్దాలీగా సంజయ్ దత్ కనిపించనున్నారు. సదాశివ్రావ్ రెండో భార్య పార్వతీబాయిగా కృతి నటించనుంది. ఆప్ఘన్లతో జరిగిన యుద్ధంలో భర్తకు ఎంతో సహకరిస్తుంది పార్వతి. చివరి యుద్ధంలోనూ భర్తతో పాటు కదనరంగంలోకి దూకుతుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో యుద్ధ ఘట్టాలు, పోరాట సన్నివేశాలు చాలా కీలకం కానున్నాయి. ఎక్కువశాతం పోరాటాలు అర్జున్, సంజయ్ పాత్రల మధ్యే జరుగుతాయి. పాత్రకు న్యాయం చేయడానికి కృతి కూడా కత్తి యుద్ధాల్లో తర్ఫీదు పొందుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.