వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సంచలనానికి మారుపేరుగా నిలుస్తుంటుంది. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టేకు, ఇప్పుడున్న నటులు, దర్శకుల్లో ఎవర్ని రిటైర్ కావాలంటారు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఏమాత్రం తడుముకోని రాధికా ఆప్టే రాంగోపాల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.