బాలీవుడ్లో అందాల తార మాధురీ దీక్షిత్ డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 80, 90 దశకాల్లో మాధురీ డ్యాన్స్ చేసిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినది తేజాబ్ చిత్రంలో ఏక్, దో, తీన్ పాట. ఈ పాటకు ప్రేక్షకులు చిత్తయిపోయారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె నటించిన పాటపై ప్రస్తుతం గ్లామర్ క్వీన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ సెప్పుులు వేశారు.
భాగీ2 చిత్రం కోసం మాధురీ దీక్షిత్ ఏక్ దో, తీన్ పాటను ఇటీవల జాక్వలైన్ ఫెర్నాండేజ్పై చిత్రీకరించారు. ఆ పాటకు సంబంధించిన ఫస్ట్లుక్ను తాజాగా జాక్వలైన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు మంచి స్పందన వ్యక్తమవుతున్నది.