తెలుగు సినీరంగంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని సురభి ఎప్పట్నుంచో కోరుకుంటోంది. అయితే ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో పాటు కాస్త నెమ్మదిగా అయినా అవకాశాలు లభిస్తున్నాయని అంటున్నారు. బీరువా చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లి భామ తొలుత తమిళ సినీరంగంలో పాదం మోపింది. ఓ వైపు తమిళ సినిమాల్లో నటిస్తూనే తెలుగు సినిమాలపై కన్నేసింది. బీరువా, ఎక్స్ప్రెస్రాజా, జెంటిల్మెన్, ఇటీవల వచ్చిన ఒక్కక్షణం వంటి సినిమాలు ఆమెకు విజయాలను అందించడంతో పాటు టాలీవుడ్లో నిలదొక్కుకునేందుకు ఆమెకు ఆశలను పెంచాయి. ఈ సినిమాలకు మధ్యలో వచ్చిన అటాక్ చిత్రం ఆమెను నిరాశపరిచినప్పటికీ విజయాల శాతం ఎక్కువగా ఉండటం వల్లే ఆమెకు అవకాశాలు రావడానికి కారణమైందని పరిశ్రమలో అంటున్నారు. చూపరులను ఇట్టే ఆకట్టుకునే చక్కటి అందం ఈ భామ సొంతం కావడమే కాదు పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించడంలో తను చూపుతున్న శ్రద్ధ కూడా పరిశ్రమ ఆమె పేరును పరిశీలించేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నారు. ఒక్కక్షణం తర్వాత ఇప్పుడామె నిఖిల్ సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వినిపిస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ కనితన్ చిత్రాన్ని తెలుగులో నిఖిల్ కథానాయకుడిగా పునర్నర్మిస్తున్నారు. కిరాక్పార్టీ తర్వాత నిఖిల్ చేసే ఈ చిత్రంలో సురభిని నాయికగా ఎంపిక చేశారని అంటున్నారు. ఇదిలావుండగా…రామ్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కలయికలో రూపొందుతున్న హలో గురు ప్రేమకోసమే… చిత్రంలో ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకో కథానాయికగా తొలుత సురభి పేరు, ఆ తర్వాత మేఘ ఆకాష్ పేరు వినిపించింది. కానీ ఆ చిత్రంలో వారిద్దరు చేయడం లేదని తాజా సమాచారం. ఇలా అడపాదడపా అవకాశాలు కాకుండా చేతినిండా చిత్రాలతో టాలీవుడ్లో బిజీబిజీగా ఉండాలని సురభి కోరుకుంటోంది.