ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌యాలు ఎక్కువ‌..అవ‌కాశాలు త‌క్కువ‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 11:05 AM



తెలుగు సినీరంగంలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని సురభి ఎప్పట్నుంచో కోరుకుంటోంది. అయితే ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో పాటు కాస్త నెమ్మదిగా అయినా అవకాశాలు లభిస్తున్నాయని అంటున్నారు. బీరువా చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లి భామ తొలుత తమిళ సినీరంగంలో పాదం మోపింది. ఓ వైపు తమిళ సినిమాల్లో నటిస్తూనే తెలుగు సినిమాలపై కన్నేసింది. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, జెంటిల్‌మెన్‌, ఇటీవల వచ్చిన ఒక్కక్షణం వంటి సినిమాలు ఆమెకు విజయాలను అందించడంతో పాటు టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ఆమెకు ఆశలను పెంచాయి. ఈ సినిమాలకు మధ్యలో వచ్చిన అటాక్‌ చిత్రం ఆమెను నిరాశపరిచినప్పటికీ విజయాల శాతం ఎక్కువగా ఉండటం వల్లే ఆమెకు అవకాశాలు రావడానికి కారణమైందని పరిశ్రమలో అంటున్నారు. చూపరులను ఇట్టే ఆకట్టుకునే చక్కటి అందం ఈ భామ సొంతం కావడమే కాదు పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించడంలో తను చూపుతున్న శ్రద్ధ కూడా పరిశ్రమ ఆమె పేరును పరిశీలించేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నారు. ఒక్కక్షణం తర్వాత ఇప్పుడామె నిఖిల్‌ సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వినిపిస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కనితన్‌ చిత్రాన్ని తెలుగులో నిఖిల్‌ కథానాయకుడిగా పునర్నర్మిస్తున్నారు. కిరాక్‌పార్టీ తర్వాత నిఖిల్‌ చేసే ఈ చిత్రంలో సురభిని నాయికగా ఎంపిక చేశారని అంటున్నారు. ఇదిలావుండగా…రామ్‌, దర్శకుడు త్రినాథరావు నక్కిన కలయికలో రూపొందుతున్న హలో గురు ప్రేమకోసమే… చిత్రంలో ఒక కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకో కథానాయికగా తొలుత సురభి పేరు, ఆ తర్వాత మేఘ ఆకాష్‌ పేరు వినిపించింది. కానీ ఆ చిత్రంలో వారిద్దరు చేయడం లేదని తాజా సమాచారం. ఇలా అడపాదడపా అవకాశాలు కాకుండా చేతినిండా చిత్రాలతో టాలీవుడ్‌లో బిజీబిజీగా ఉండాలని సురభి కోరుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com