మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి దంపతులు, చరణ్ దంపతులు, కళ్యాణ్, శ్రీజ, అల్లు అరవింద్ తో పాటు చిత్ర యూనిట్ కి సంబంధించి ప్రతి ఒక్కరు హాజరయ్యారు. చిరంజీవి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు 1980 కాలం నాటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉన్నాయి. ఊరి ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో సాగే చిత్రంగా రంగస్థలం మూవీ ఉంటుందని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది. ‘మా ఇంజన్కి కులం గోత్రాలు ఉండవ్.. ఏ చేనైనా తడిపేద్దంతే’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉండగా.. గిల్లుతున్నావేంటి? గాజులు కొనిపెట్టమంటే అంటూ సమంత వయ్యరాలు వలకబోస్తున్న సీన్స్ పల్లెవాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. సిట్టిబాబు చెవులోకి మాట ఎల్లడం కష్టం కాని ఒకసారి ఎల్లిందంటే అక్కడే ఉండిపోద్దయ్యా’..అనే డైలాగ్ అభిమానులని ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ చిత్రం చరణ్ కెరీర్ లోబెస్ట్ మూవీగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. దేవి శ్రీ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 30న రంగస్థలం చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.