మల్టీ స్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేష్ ముందుంటారన్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ తో `మసాలా' సినిమాలు చేసిన వెంకటేష్ ఇప్పుడు తన మేనల్లుడు (సోదరి కుమారుడు) చైతన్యతో ఒక సినిమా చేయబోతున్నారు!
పవన్ కళ్యాణ్ తో `సర్దార్ గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో `జై లవకుశ' చిత్రాలు రూపొందించిన యువ దర్శకుడు బాబీ చెప్పిన కథను సురేష్ బాబు ఓకే చేశారని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ-కోన ఫిలిం కార్పొరేషన్ లతో కలిసి ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నదని సమాచారం అందుతోంది.
వెంకీ, చైతూల సరసం నటించే హీరోయిన్స్ కోసం ఇప్పటికే అన్వేషణ మొదలయ్యిందని, త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది!