కార్గిల్ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా జీవితాధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘షేర్షా’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రం ఆగస్టు 12 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలుగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలతో కూడిన సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు దేశభక్తి మరోవైపు ప్రేమ.. ఈ రెండింటి సమన్వయంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.