జీ. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహా శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గల్లీ రౌడీ. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్ లని సైతం విడుదల చేసింది. అయితే ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ధియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.