దక్షిణాదిన టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రియ దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. దక్షిణాదిన రజినీకాంత్, చిరంజీవి, నాగార్జున, విక్రమ్ వంటి హీరోల సరసన నటించింది. తాజాగా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టి, తన ప్రియుణ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
రష్యాకు చెందిన ఆండ్రీ కొశీవ్ను శ్రియ ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈనెల 14వ తేదీన శ్రియ వివాహం ముంబైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా జరిగిపోయింది. తాజాగా ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత శ్రియ సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. భర్తతోపాటు భారత్లోనే క్రీడా పరికరాల వ్యాపారం చేయబోతున్నట్టు సమాచారం.